Thalliki Vanadanam Scheme 2025: NPCI Link పెండింగ్ ఉన్న జాబితా విడుదలైంది, ఈ లిస్టులో మీ పేరు ఉంటే డబ్బులు పడవు

Telegram Channel Join Now

Thalliki Vanadanam Scheme 2025: NPCI Link పెండింగ్ ఉన్న జాబితా విడుదలైంది, ఈ లిస్టులో మీ పేరు ఉంటే డబ్బులు పడవు

మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము Thalliki Vanadanam Scheme 2025 ద్వారా 1వ తరగతి నుండి 12వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థుల తల్లుల ఖాతాల్లో 15 వేల రూపాయలు జమ చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే, ఇప్పటికే చాలామంది తలలు ఖాతాల్లో డబ్బులు జమ కూడా అయ్యాయి, అయితే ఇప్పటికీ కొంతమంది తల్లుల ఖాతాల్లో డబ్బులు జమ కావడం లేదు..కారణం బ్యాంకు ఖాతా NPCI Link అయి ఉండాలి. తాజాగా ప్రభుత్వం 9వ తరగతి ఇంకా 10వ తరగతి , ఇంటర్ సెకండియర్ చదువుతున్న విద్యార్థుల తల్లుల NPCI Link పెండింగ్ ఉన్నవారి జాబితా విడుదల చేసింది..కాబట్టి NPCI పెండింగ్ లిస్ట్ లో మీ పేరు ఉంటే త్వరగా NPCI Link ప్రక్రియ పూర్తి చేయండి. ఈ ఆర్టికల్ లో NPCI Link పెండింగ్ లిస్ట్ ఎలా చెక్ చేయాలి..మరియు NPCI Link ఎలా చేసుకోవాలో చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది.

Thalliki Vanadanam Scheme 2025

NPCI Link ఎందుకు ముఖ్యం?

Thalliki Vanadanam Scheme 2025 యొక్క డబ్బులు నేరుగా తల్లుల ఖాతాల్లో జమ అవుతాయి. ఈ డబ్బులు ఎటువంటి అక్రమాలకు తావు లేకుండా సక్రమంగా జమ కావాలి అంటే..బ్యాంకు ఖాతా ఆధార్ తో లింక్ అయ్యి…NPCI మ్యాపింగ్ అయిఉండాలి..ఆ తర్వాతే మీ అకౌంట్ లలో నిధులు జమ అవుతాయి.

JOIN OUR TELEGRAM CHANNEL

NPCI Link పెండింగ్ జాబితాను ఎలా చెక్ చేయాలి?

  • మీకోసం ఇక్కడ NPCI Link పెండింగ్ లిస్ట్ ఇవ్వడం జరిగింది దాన్ని డౌన్లోడ్ చేసుకుని మీ పేరు చెక్ చేసుకోవచ్చు
  • మీ గ్రామ సచివాలయం లో కూడా ఈ లిస్ట్ అందుబాటులో ఉంటుంది
  • ఆంధ్రప్రదేశ్ అధికారిక వెబ్సైట్ gsws.ap.gov.in లో Thalliki Vanadanam ఆప్షన్ పై క్లిక్ చేసి మీ స్టేటస్ ను చెక్ చేసుకోండి
👉NPCI Link పెండింగ్ లిస్ట్ 

NPCI Link ప్రక్రియ ను ఎలా పూర్తి చేయాలి?

  • మీ బ్యాంకు ఖాతా ఉన్న బ్యాంకు శాఖకు వెళ్లి..ఆధార్ కార్డ్ తో బ్యాంకు ఖాతాను లింక్ చేయండి అలాగే NPCI Link కోసం కాన్సెంట్ ఫారం ను సమర్పించాలి.
  • ఒకవేళ బ్యాంకు ఖాతా లేకపోతే..సమీప పోస్టాఫీసు ఆధార్ తో లింక్ అయిన సేవింగ్స్ ఖాతా ను ఓపెన్ చేసుకోవచ్చు..ఇది 10 రోజులలో NPCI Link ప్రక్రియ ను పూర్తి చేస్తుంది.
  • NPCI Link ప్రక్రియ పూర్తి అయిన తర్వాత మీ సచివాలయం కి వెళ్ళి.. వెల్ఫేర్ అధికారులను సంప్రదించి…అప్డేట్ చేయమని చెప్పండి.

గమనిక : తల్లి యొక్క eKYC కూడా పూర్తయ్యి ఉండాలి.

ఇది కూడా చదవండి 👉 తల్లికి వందనం పథకం 2025 : స్టేటస్ చేసుకునే విధానం 

చివరగా

మీకు Thalliki Vanadanam Scheme 2025 డబ్బులు పడకపోతే..కంగారు పడకండి, పైన చెప్పిన విదంగా NPCI Link చెక్ చేసుకుని సచివాలయంలో అప్డేట్ చేస్తే…మీకు జూలై 5వ తేది లోపల డబ్బులు మీ అకౌంట్ లో జమ అవుతాయి..ఆల్ ది బెస్ట్!

Leave a Comment